డ్రాగన్ కంట్రీలో మరో వైరస్ కలకలం…కోవిడ్ కంటే డేంజర్..తొలి మరణం నమోదు..

New Virus Detected in China

డ్రాగన్ కంట్రీ చైనా…పలు రకాల వైరస్ లకు పుట్టినిల్లు. చైనా దేశంలో ప్రాణాంతక వైరస్ లు పుట్టుకకు కేంద్రంగా మారినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దేశంలోని వుహాన్ ప్రయోగశాల ల్యాబ్ నుంచి కోవిడ్ వైరస్ పుట్టినట్లు ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. తాజాగా మరో వైరస్ చైనా నుంచి పుట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ వైరస్ పేరు మంకీ బి. కోవిడ్ వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైంది. మంకీ బీ గా పిలిచే ఈ కొత్త వైరస్ సోకీ చైనాలో ఓ శాస్త్రవేత్త మరణించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోతులపై పరిశోధనలు చేసే పశువైద్య నిపుణులు ఒకరు మంకీ బీ వైరస్ బారినపడి మరణించారు.

ఇక మంకీ బీ వైరస్ బయటపడేందుకు 1 నుంచి 3 వారాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మంకీ బీ వైరస్ సోకితే ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుందని గుర్తించారు. వైరస్ సోకితే 70 నుంచి 80శాతం మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కోతుల నుంచి మనుషులకు సంక్రమించే మంకీ బీ వైరస్ తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు చైనా తాజాగా వెల్లడించింది. ఇది మొదటి కేసు …మొదటి మరణంగా పేర్కొంది. అయితే అతడితో దగ్గరగా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు లేవని లోకల్ మీడియా తెలిపింది.

జంతువులపై పరిశోధనలు చేస్తున్న బీజింగ్ చెందిన ఓ పశువైద్యుడు మార్చిలో మరణించిన రెండు కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షలు నిర్వహించాడు. అనంతరం అతను వాంతులు, వికారం వంటి లక్షణాలతో బాధపడ్డాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మే 27న ఆ వైద్యుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. వైద్యుడి నమూనాలను పరిశీలించగా…మంకీ బి వైరస్ కారణంగా అతడు మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాల ఇంతకుముందు ఇలాంటి వైరస్ ఎవరిలోనూ బయటపడలేదని…ఇదే మొదటి కేసు మొదటి మరణమని చైనాకు చెందిన సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. ఈ వైరస్ ను మొదటిసారిగా 1932లో మాకా్స్ అనే కోతి జాతిలో గుర్తించారు. కోతుల నుంచి నేరుగా మనుషులకు సంక్రమించే ఈ వైరస్ చాలా ప్రమాదాకరమని..ఈ వైరస్ సోకితే మరణాల రేటు 80శాతం వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Spread the love