బస్ స్టాప్ లో ఉంది సాయి పల్లవేనా..
సినిమా హీరో హీరోయిన్ లు ఎక్కడైనా కనపడితే అక్కడ ఉండే అభిమానులను ఆపడానికి బౌన్సర్లు సైతం ఎన్ని తిప్పలు పడతారో మనందరికీ తెలిసిన సంగతే అయితే మలయాళ కుట్టి ప్రజల మధ్యలో సామాన్యురాలిలా తిరిగినా ఎవరు పట్టించుకోలేదు ఆ తార ఎవరో కాదు “ ఫిదా “ సినిమాలో తెలంగాణ యాస తో అందరికీ సుపరిచితురాలు అయిన సాయి పల్లవి నే.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రాణా సాయి పల్లవీ జంటగా నటిస్తున్న చిత్రం విరాట్ పర్వం. ఈ సినిమా షూటింగ్ నేపధ్యంలో చిత్రా బృందం సినిమాలోని
కొన్ని సన్నివేశాలను యదార్ధంగా చిత్రీకారించాలన్న ఉద్దేశ్యంతో బస్ స్టాప్ సన్నివేశాన్ని వరంగల్ లోని పరకాల బస్ స్టాప్ లో చిత్రీకరించారు. సన్నివేశం ప్రకారం సాయి పల్లవి బస్ స్టాప్ కి వచ్చి బస్ ఎక్కే సన్నివేశాన్ని ఈ బస్ స్టాప్ లో రహస్యంగా చిత్రీకరించడానికి అక్కడే ఉన్న ఒక హోటల్ లో సీక్రెట్ కెమెరా ను ఉంచి చిత్రీకరణ చేశారు. అయితే ఈ సన్నివేశం ప్రకారం సాయి పల్లవి ఒక బాగ్ ను తగిలించుకొని సామాన్య ప్రయాణికురాలిలాగే వచ్చి బస్ స్టాప్ లోని ఒక బళ్లపై కూర్చొని బస్ కోసం ఎదురు చూస్తోంది ఆమెను సరిగా పట్టించుకొని ఆ చుట్టూ పక్కల వారు ఆమె పక్కనే కూర్చొని ఏమి తెలియనట్లే వెళ్ళిపోయారు. ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న కొంతమంది తమ కెమెరాలలో బందించి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో మనం కూడా ఒక లుక్ వేద్దామా…
బస్ స్టాండ్ లో సాయి పల్లవి #APPolitrics pic.twitter.com/oACHWKxO7o
— AP_Politrics (@appolitrics) September 8, 2019