వైసీపీ పాచిక…తిరుపతి ఎన్నికల కోసమేనా?

Acham Naidu Audio Leak

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే అచ్చెన్న ప్రైవేట్ వ్యాఖ్యలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సామాజిక మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ప్రచారం చేస్తోంది. ప్రధానంగా ఆ వీడియోను ఓసారి పరిశీలించినట్లయితే…లోకేశ్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు మధ్య దూరం పెంచే ఉద్దేశ్యంతోనే కొన్ని సంభాషణలను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అచ్చెన్నాయుడు భోజనం చేస్తూ…తన దగ్గరికి వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్న వీడియో అది. అందులో ఒక వ్యక్తి తన గోడును అచ్చెన్నకు చెప్పుకుంటున్నాడు. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని…30ఏళ్లు సర్వీసు చేశానని…చెప్పుకొచ్చారు. దానికి అచ్చెన్నాయుడు కూడా 17తారీఖున ఎన్నికలు అయిపోతాయి…అప్పుడు ఫ్రీ అయిపోతాను అన్నారు.

 

తర్వాత ఏ సందర్భంలో అన్నారో కానీ.. పార్టీ లేదు, బొక్క లేదు అనే వాయిస్ కూడా ఉంది. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ కు మూడు రోజల ముందు ఈ వీడియోను లీక్ చేయడం…ముమ్మాటికీ ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన పన్నాగంగా టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై అచ్చెన్న కూడా స్పందించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా…తిరుపతిలో టీడీపీ విజయాన్ని ఆపలేరు. చంద్రబాబు, లోకేష్ తో తన అనుబంధాన్ని విడదీయలేరని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు పబ్లిక్ గ్గా ఎలా ఉంటారు…ప్రైవేట్ గా ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. అంతేకానీ టీడీపీపై ఆయనకున్న నిబద్దతను ఎవరూ అనుమానించలేరు…శంకించలేరని…ఆ పార్టీలో నేతలు చెబుతుంటారు. కావాలనే ఈవిధంగా ప్రైవేట్ వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి…తిరుపతి ఎన్నికల ముందు బయటపెట్టి…టీడీపీలో గందరగోళ పరిస్థితులను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love