పవన్ కేంద్రమంత్రి నిజమేనా…ఒట్టి కలరింగేనా…?
ఈ మధ్య మెగా బ్రదర్స్ కు సంబంధించిన వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఏంటంటే..మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ ఎంపీ అని…రెండోది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో మంత్రి పదవని బాగా ప్రచారం అవుతున్నాయి. చెప్పాలంటే ఈ రెండు వార్తలు కూడా ఆశ్చర్యకరమైన విషయాలే. ఎందుకంటే రెండు విషయాలు కూడా ఊహకు అందినట్లు లేవు కాబట్టి.
మొదట చిరంజీవి విషయాన్ని పరిశీలించినట్లయితే…రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొనసాగించలేక జెండా ఎత్తేశారు. దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. రాజ్యసభ ఎంపీ సభ్యత్వం అయిపోయిన తర్వాత పాలిటిక్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా సంతోషంగా సినిమాలు చేసుకుంటున్నారు. అలాంటిది ఇఫ్పుడు రాజ్యసభ సభ్యత్వం తీసుకుని మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనేది అనుమానమే.
ఇక విపక్షల్లోని ఏపార్టీ తరపున ఎలాంటి అవకాశం లేదు కాబట్టి వైఎస్సార్ సీపీ తరపున రాజ్యసభ ఎంపీ కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమేనా…ఎంతవరకు నమ్మవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..కేంద్రంలో మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కానీ విషయం. జనసేనకు ఉన్నదే ఒక ఎమ్మెల్యే…ఆ ఎమ్మెల్యే కూడా పార్టీలో లేరు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఘోర పరాజయం పొందారు.
అటు తిరుపతిలో మొన్న జరిగిన లోక సభ ఉపఎన్నికలో బీజేపీని గెలిపించారా అంటే అదీ లేదు. పవన్ ప్రచారం చేశారు కానీ డిపాజిట్ కూడా దక్కలేదు. మరి పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వటం వల్ల బీజేపీకి వచ్చిన లాభమేంటో తెలియదు. ఏరకంగా ఆలోచించినా…పవన్ కేంద్రమంత్రి ఇవ్వటానికి లాజిక్ మాత్రం కనిపిస్తలేదు ఇక చిరంజీవికి పవన్ కు పదవులు ఇవ్వడం వల్ల కాపులంతా వైఎస్సార్ సీపీకో లేదా బీజేపీకో ఓట్లే వేస్తారా అంటే అది కూడా అనుమానమే.
ప్రజారాజ్యంపార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి….మొన్నటి ఎన్నికల్లో పవన్ కు కాపుల సపోర్టు లభించలేదన్నది వాస్తవం. కాపులు చిరంజీవిని పవన్ ను నమ్మి ఓట్లేయనప్పుడు ఇతర పార్టీలు ఏం చూసి వాళ్లకు పదవులిస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా మీడియా ఊదరగొడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి ఢిల్లీ వర్గాలని…విశ్వసనీయ సమాచారం అని…ఇంకేదో…ఇంకేదో అని కలరింగ్ ఇస్తోంది తప్ప అందులో ఏమీ లేదంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.