మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 152 వ చిత్రం సైరా నరసింహ రెడ్డి. తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి ఆందరికి విదితమే. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ప్రేక్షకులకే అంకితం చేయకుండా దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది ఇదే తరుణంలో ఇప్పటికే సినిమా ను పలు భాషల్లో చిత్రకరించారు. ఈ చిత్రం లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అదే విదంగా అన్ని భాషల్లో మంచి క్రేజ్ తెచ్చేందుకు
చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం అన్ని భాషలకు చెందిన తారాగణాన్ని చిత్ర యూనిట్ ఎంపిక చేసుకుంది. స్వాతంత్ర కోసం పోరాడిన ప్రథమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను ఆధారంగా చేసుకొని ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు కొత్త కష్టం వచ్చి పడింది. ఉయ్యాలవాడ వంశానికి చెందిన కొందరు వ్యక్తులు సినిమా నిర్మాత రామ్ చరణ్ మరియు చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి పై
జూబ్లీ హీల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఉయ్యలవాడ చిత్రాన్ని నిర్మించే ముందు చిత్ర యూనిట్ తమ వద్దకు వచ్చి కథను తెలుసుకున్నారని అదే విదంగా సినిమా కు సహకరించే విదంగా కావాల్సిన అన్ని సహకారాలు తాము అందచేశామని అందుకు కొంత సొమ్ముని తమకు ఇస్తామన్నారని వారు తెలిపారు అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి సహాయం అందలేదని, సినిమా నిర్మాణం కూడా పూర్తయి విడుదలకు సిద్దంగా ఉందని ఇప్పటికైనా తమకు రావలసిన సొమ్ముని ఇప్పించాలని చిత్ర యూనిట్ ని కలిసినపుడు వారు స్పందించడం లేదని కావున తమకు న్యాయం చేయాలని ఉయ్యలవాడ వంశస్థులు పోలీసులను ఆశ్రయించారు. వారు భరణంగా సుమారు రూ. 50 కోట్ల రూపాయలను అడుగుతున్నారని సోషల్ మీడియా లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై మెగాస్టార్ చిరంజీవి మరియు సినిమా నిర్మాత దర్శకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.