కరోనా కేసుల్లో భారత్ లో కొత్త రికార్డు

Corona

దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ తన ప్రభావాన్ని పెంచుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత అన్నీ కేసులు నమోదవుతున్న దేశం మనదే. ప్రతి రోజు నమోదు అవుతున్న కేసులు రోజుకో రికార్డు ను దాటవేస్తున్నాయి. అయితే గత 24 గంటల్లో నమోదైన కేసులు ఇప్పుడు కొత్తగా మరో రికార్డు ను నెలకొల్పాయి.

వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా కొత్తగా 90,802 కేసులు నమోదు కాగా 1,016 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 42,04614. ఇందులో ఇప్పటికే 32,50,429 మంది కరోనాను జయించగా 8,82,542 కేసులు ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 71,642 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Spread the love