పూజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్న అతి కొద్ది హీరోయిన్ లలో పూజ హెగ్డే ఒకరు. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసింది. టాలీవుడ్ లో అడుగు పెట్టిన తొలినాళ్లలో అంతగా విజయాలు అందుకొని పూజ హెగ్డే ఫిల్మ్ కెరీర్ డిజే సినిమా తర్వాత మారిపోయింది. డిజే సినిమా తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న పూజ ఎన్టిఆర్ సరసన నటించిన అరవింద సామెత తో మంచి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత నటించిన మహర్షి సినిమా కూడా మంచి విజయం సాధించడంతో పూజ తన రెమ్యునరేషన్ ను అమాంతంగా పెంచేసింది.
ప్రస్తుతం పూజ సుమారుగా ఒక్కో సినిమాకు రూ. 1.2 కోట్ల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటుంది. టాలీవుడ్ లో జాన్, అల్లు అరవింద్ అల వైకుంఠపురం లో నటిస్తున్న పూజ బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 లో నటిస్తుంది. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తున్న తమన్నా, కాజల్ లు సీనియర్లు కావడం, సమంతకు కూడా పెళ్లి కావడంతో పూజ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.