ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి…తోమర్ ను అందుకే తప్పించారా?

Uttarakhand CM Thomar

వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ మినీ సంగ్రామంలో విజయం కోసం బీజేపీ ఆరాటపడుతోంది. ఈ మధ్య పట్టుజారుతున్న వాతావరణం కనిపిస్తుండటంతో…చక్కదిద్దే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోపాటుగా రాష్ట్రాల్లోనూ చర్యలు చేపట్టింది.

2022లో ఎలక్షన్స్ జరగనున్న 5 రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర సీఎంను మార్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎంను ఎన్నుకున్నారు. అన్ని అంశాలనూ పరిశీలనలోకి తీసుకున్న హైకమాండ్…కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ దామిని సెలక్ట్ చేసింది.

శనివారం సాయంత్రం భేటీ అయిన బీజేపీ శాసనసభాపక్షం…ధామిని శాసనసభా పక్షనేతగా ఎన్నుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ శాసనసభాపక్ష భేటీకి హాజరయ్యారు. ఇక అసమ్మతి సమస్య రాకుండా ముందస్తుగా తోమర్…కీలక నేతలతో వరుస మంతనాలు జరిపారు. నిజానికి ముఖ్యమంత్రి సీటుకోసం సత్పాల్ మహారాజ్ ధన్ సింగ్ రావత్ రేసులో ఉన్నారు. ఎవరికి వారు సీఎం సీటు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అన్ని అంశాలనూ పరిగణలోనికి తీసుకున్న హైకమాండ్ పుష్కర్ సింగ్ ధామినికే మొగ్గు చూపింది. దీంతో ఆయన్ను ఏకగ్రీవంగా సీఎల్పీ నేతగా ప్రకటించింది.

అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి తీరత్ సింగ్ ఈ ఏడాది మార్చిలోనే బాధ్యతలను స్వీకరించారు. మార్చి 10వ తేదీన తీరత్ సింగ్ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఆయన ఎమ్మెల్యే కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం…సాధారణ పౌరుడు ఎవరైన సీఎం కావచ్చు. మంత్రి కూడా కావచ్చు. కానీ ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ఆరునెలల్లో ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి గెలిచి శాసన సభ్యుడు కావాలి లేదంటే…ఎమ్మెల్సీ అయినా అయిఉండాలి.

కానీ తోమర్ ఇప్పటివరకు ఏ ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాలేకపోయారు. సెప్టెంబర్ 5లోగా ఆయన గడువు ముగియనుంది. ఆ తర్వాత మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 6 నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించడం అనేది కుదరదు. ఈ కారణంగానే ఆయన రాజీనామా చేశారన్న టాక్ వినిపిస్తోంది. కానీ హైకమాండ్ తలుచుకుంటే…ఇదొక పెద్ద విషయమే కాదు. ఇతర కారణాలతోనే ముఖ్యమంత్రిని తప్పించి ఉంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.

Spread the love