రూ.400కోట్ల సర్కార్ భూమిని కాజేసిన వైసీపీనేతలు..ఆధారాలు భయటపెడతానంటోన్న టీడీపీ నేత!

Nallari kishore kumar reddy shocking comments against YCP leaders Land Scam

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా వాటికి తగిన ఆధారాలు లేవు. ప్రజాసంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సర్కార్… ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అని చెప్తూ వచ్చింది. అయితే ఇలాంటి సందర్భంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 4వందల కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు మింగేశారని ఆరోపించారు.

చిత్తూరు జిల్లా పీలేరులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సర్కార్ భూమిని అధికారపార్టీ నేతలు కబ్జా చేశారని కిశోర్ కుమార్ రెడ్డి అన్నారు. అంతేకాదు..లేఔట్ చేస్తూ విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తన దగ్గర ఉన్నాయని వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వాటిని తొందర్లోనే బయటపెడతానన్నారు. పీలేరుతోపాటు చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి కబ్జాలు సాగుతున్నాయన్నారు. వందలు వేల కోట్ల విలువైన సర్కారు భూములను కాజేస్తున్నా….ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.త్వరలోనే మీడియాకు కూడా ఆ స్థలానికి సంబంధించిన విషయాలన్నీ బయటపెడతానన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇక ఈ దందా వెనక జిల్లాకు చెందిన మంత్రితోపాటు, ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నారన్నారు. వారి అండదండలతోనే ఈ అక్రమం కొనసాగుతోందన్నారు. అధికారులను రాజకీయంగా ఒత్తిడికి గురిచేసి…వారిని సరిగ్గా పనిచేయనివ్వట్లేదని ఆరోపించారు. సీఎం జగన్ రెడ్డి తక్షణమే స్పందించి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఈ అక్రమాల్లో టీడీపీ నేతల హస్తం ఉన్నా…వదిలిపెట్టొదన్నారు. తన దగ్గర సర్వే నెంబర్లతో సహా అన్ని వివరాలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని త్వరలో మీడియా ముందుంచుతాన్నారు.అధికారపార్టీకి చిత్తశుద్ది ఉంటే..న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం , వైసీపీ నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Spread the love